Friday, May 22, 2026

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

మెండోరా : మండిపోతున్న ఎండల తీవ్రత మధ్య ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు గ్రామ సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్ మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లిన ఆయన, కూలీలకు తాగునీరు మరియు మజ్జిగ అందించి వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూలీలు ఇబ్బందులు పడకుండా గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఎండల సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, తరచూ నీరు మరియు శీతల పానీయాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీనివాస్, శంకర్ , పంచాయతీ సెక్రెటరీ భోజన్న, కారోబార్ చిరంజీవి , ఫీల్డ్ అసిస్టెంట్ గంగారం తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

అడిషనల్ డీసీపి శుభం ప్రకాష్ ను కలిసిన సమాజ సేవకుడు పట్వారి తులసి కుమార్

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన అడిషనల్ డీ. సీ. పి శుభమ్ ప్రకాష్ ని ఆర్మూర్ పట్టణ జాతీయ...

More Articles Like This