నిజామాబాద్ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షా శిక్షణ అభియాన్ కార్యక్రమం… నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం బాలికల ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడింది.
ముగింపు కార్యక్రమంలో భాగంగా, నిజామాబాద్ జిల్లా సీనియర్ కరాటే మాస్టర్స్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి మరియు నోడల్ ఆఫీసర్ లను మర్యాదపూర్వకంగా శాలువతో సత్కరించారు.
ఈ సందర్భంగా కరాటే మాస్టర్స్ తమ సమస్యలను అధికారులు ముందుకు తీసుకువచ్చారు. వారి సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం ద్వారా బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు, ఆత్మరక్షణపై అవగాహన కూడా విస్తరిస్తుందన్నారు.



