Sunday, June 28, 2026

ఏసీబీలలో మరో అవినీతి చేప

📰 Generate e-Paper Clip

నిర్మల్:  జిల్లా లోని మామడ పోలీసు క్వార్టర్స్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఒక భూ వివాదానికి సంబంధించి  లంచం తీసుకుంటున్న సమయంలో మామడ ఎస్‌ఐ తీగల అశోక్‌ను అధికారులు రంగం లోకి దిగి వలవేసి  పట్టుకున్నారు.భూవివాదంలో జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం కోసం ఎస్‌ఐ అశోక్ రూ.40 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇవాళ రూ.20 వేల నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని పట్టుకున్నారు. అనంతరం పోలీసు క్వార్టర్స్‌లో సోదాలు నిర్వహించిన అధికారులు, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This