ఆర్మూర్: ఆర్మూర్ కు చెందిన గ్రాండ్ మాస్టర్ కరాటే భోజన్న ఆధ్వర్యంలో ఇటీవల గద్వాల్ లో జరిగిన 16వ నేషనల్ ఓపెన్ తైక్వాండో పోటీలు ఘనంగా నిర్వహించడం జరిగింది.15,16, 17 తేదీలలో నిర్వహించిన తైక్వాండో 16 వ జాతీయ ఒపెన్ ఛాంపియన్షిప్ పోటీలలో మన నిజామాబాద్ జిల్లా నుండి బాల, బాలికలు వివిధ విభాగాల నుండి పాల్గొని,ఒక గోల్డ్,ఒక సిల్వర్ 9 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. పథకాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులు భరత్ గోల్డ్, శ్రీ వర్షిక సిల్వర్, అరూఫ్,లలిత,సునీల్, వినీషిక,చంద్రకాంత్, శ్రీవర్ధన్ తేజ్ బ్రాంజ్ సాధించారు.వీరిని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు సాయి తేజ రెఫరీగా మెమొంటోలు ఇచ్చి అభినందించారు. నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటే భోజనం ను రాష్ట్ర అధ్యక్షులు మోట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీహరి, వీఐపీ ప్రభాకర్ లు కరాటే భోజన్నను సత్కరించారు.


