Sunday, June 28, 2026

మెండోరాలో చలివేంద్రం కేంద్రాల ప్రారంభం

📰 Generate e-Paper Clip

మెండోరా: మండల కేంద్రంలో సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో రెండు చలివేంద్రం కేంద్రాలను ప్రారంభించారు. మొదటి కేంద్రాన్ని వివేకానందుని బస్టాండ్ సమీపంలో సఫాయి కార్మికురాలితో ప్రారంభించడం ప్రత్యేకంగా నిలిచింది. రెండవ చలివేంద్రం కేంద్రాన్ని  వార్డు సభ్యులతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మిట్టపల్లి రాజేశ్వర్, వార్డు సభ్యులు సాయన్న, శ్రీనివాస్, శంకర్, మమత, కారోబార్ చిరంజీవి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This