వేల్పూర్ మండలం మోతే గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రన్ని మోతే సర్పంచ్ దొల్ల రమేష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు వరి ధాన్యాన్ని గవర్నమెంట్ కేంద్రమైనటువంటి ఐకెపి సెంటర్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని,దళారులను ఆశ్రయించవద్దని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలోఐకేపీ ఏపిఎం మాణిక్యం ఉపసర్పంచ్ పరంజ్యోతి,కాంగ్రెస్ నాయకులు రాజేందర్,భగవాన్దాస్ సూరి రాజేశ్వర్,అధికారులు,సమాఖ్య మహిళా సంఘ గ్రూపు సభ్యులు పాల్గొన్నరు.



