ఆలూర్ మండలంలోని మచ్చర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ కట్ట నర్సయ్య చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉప సర్పంచ్ కట్ట నర్సయ్య మాట్లాడుతూ… ఎండల తీవ్రత ఎక్కువ అవుతున్న తరుణంలో కార్యాలయానికి వచ్చిన అధికారులకు, అనధికారులకు, గ్రామ ప్రజలకు కార్యాలయ సిబ్బందికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశానన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు సంతోష్ యాదవ్,జగదీశ్వర్, భూమా గౌడ్, లక్ష్మి బంజ లింగమయ్య,సెక్రెటరీ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



