Thursday, May 14, 2026

అనారోగ్యంతో ఉన్న పేదల ఆరోగ్యమే ఆయన సంకల్పం_2 లక్షల LOC అందజేసిన వేముల ప్రశాంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

చిన్నపాటి ఆపరేషన్ తో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ తనను నమ్మిన పేద ప్రజల సంక్షేమం, ఆరోగ్య సమస్యల పట్ల ఆగ మేఘాల మీద స్పందించడం ఆయన నైజం… కొద్దిగా అనారోగ్యము బాధ పెడుతున్న తనను నమ్ముకున్న వారికి చేయూతనివ్వడమే ఆయన సంకల్పం. తాజాగా మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ఈరమణి నిర్మల వెన్నెముక సమస్య తో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్ చికిత్స కోసం చేరడం జరిగింది. స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగ వెన్నెముక సర్జరీ కోసం 2,00,000 LOC మంజూరు చేయించి LOC ని ఈ రోజు హైదరాబాద్ లోని నివాసంలో వారి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ని చొరవను పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ సందర్బంగా చికిత్స కొరకు LOC మంజూరు చేయించిన ఎమ్మెల్యే కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

చేపూర్ ఉన్నత పాఠశాలలో బడి ఈడుగల పిల్లల్ని బడిలో చేర్పించాలన్న… సర్పంచ్ సారంగి శాంతి కుమార్…

ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాలలో "బడి-బాట" కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ సారంగి శాంతి కుమార్ మాట్లాడుతూ బడి ఈడు...

More Articles Like This