మెండోర: మండలంలోని ప్రజలకు ముఖ్య సమాచారం. ఎస్సీ కార్పొరేషన్ నిజామాబాద్ కార్యనిర్వహక సంచాలకుల ఆదేశాల మేరకు EV ద్విచక్ర వాహనాల లబ్ధిదారుల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో లక్ష్మణ్ తెలిపారు.
ఈ ఇంటర్వ్యూలు తేది 02-05-2026 (శనివారం) ఉదయం 11.00 గంటలకు మెండోర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరగనున్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా సమయానికి హాజరుకావాలని ఆయన తెలిపారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించబడుతుందని, అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.



