కమ్మర్పల్లి: వీఆర్ఏ ఉద్యోగులకు సంబంధించిన,దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను,న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కమ్మర్ పల్లి మండలంలోని వీఆర్ఏలు తహసిల్దార్ జి.ప్రసాద్ కు వినతిపత్రంఅందజేశారు.ఈసందర్భంగావీఆర్ఏలసంఘం మండల అధ్యక్షుడు మేకల శంకర్ మాట్లాడుతూగతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61సంవత్సరాలు నిండిన వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని,వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించి కొద్ది మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిందని,ఇంకా ఉద్యోగాలు రాని వారూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని,వెంటనే వారికి ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈసందర్భంగా విజ్ఞప్తి చేశారు.ఈకార్యక్రమంలోఉపాధ్యక్షుడుసింగారం భూమేశ్వర్,విఆర్ఎలు,తదితరులు పాల్గొన్నారు.


