Friday, June 19, 2026

యూరియా అప్‌ను వెంటనే రద్దు చేయాలని బిఆర్ఎస్ నాయకుల ధర్నా

📰 Generate e-Paper Clip

మెండోరా: రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా బుకింగ్ యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ నాయకులు పోచంపాడు ఎక్స్ రోడ్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. యాప్ కారణంగా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాంకేతిక సమస్యల వల్ల చాలామంది రైతులు యూరియా పొందలేకపోతున్నారని నాయకులు ఆరోపించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగంపేట శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు సులభంగా ఎరువులు అందేలా గతంలో అమలులో ఉన్న విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. యూరియా పంపిణీలో పారదర్శకతతో పాటు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాప్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో బిఆర్ఎస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Must Read
- Advertisement -
Latest News

సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన పెంచుకోవాలి

బాల్కొండ: మాదక ద్రవ్యాలు, డ్రగ్స్‌, సైబర్‌ నేరాల నియంత్రణకు  విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఆర్మూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి అన్నారు. బాల్కొండ లోని...

More Articles Like This