Wednesday, June 10, 2026

రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షా శిక్షణ అభియాన్ –

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షా శిక్షణ అభియాన్ కార్యక్రమం… నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం బాలికల ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడింది.
ముగింపు కార్యక్రమంలో భాగంగా, నిజామాబాద్ జిల్లా సీనియర్ కరాటే మాస్టర్స్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి మరియు నోడల్ ఆఫీసర్ లను మర్యాదపూర్వకంగా శాలువతో సత్కరించారు.

ఈ సందర్భంగా కరాటే మాస్టర్స్ తమ సమస్యలను అధికారులు ముందుకు తీసుకువచ్చారు. వారి సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమం ద్వారా బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు, ఆత్మరక్షణపై అవగాహన కూడా విస్తరిస్తుందన్నారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This