26.9 C
Hyderabad
Wednesday, August 12, 2026

ఆర్మూర్ కోర్టులో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం…

Must read

📰 Generate e-Paper Clip

ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆర్మూర్ కోర్టులో న్యాయవాదులు పాలాభిషేకం చేశారు.న్యాయవాదుల అరెస్టుకు కోర్టు అనుమతి తప్పనిసరి అని, తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం 2026 అమల్లోకి వచ్చిందని,నోటిఫికేషన్ రిలీజ్ చేసిన రాష్ట్ర న్యాయశాఖకు ఏ వదులు కృతజ్ఞతలు తెలియజేశారు.రాష్ట్రంలోనే న్యాయవాదుల రక్షణ చట్టం 2026 రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందని,ఈ చట్టం జూన్ 2 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లుగా ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

కోర్టులో కక్షి దారుల తరఫున వాదించే లాయర్లు ఎటువంటి భయాలు లేకుండా తమ విధులను నిర్భయంగా స్వతంత్రంగా నిర్వహించేలా చేయడమే కొత్త చట్టం ప్రధాన ఉద్దేశం అని న్యాయవాదులు లేదా వారి కుటుంబ సభ్యులపై భౌతిక దాడులు బెదిరింపులకు లేదా దుర్భాషలాడటం వంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని,విధి నిర్వహణలో ఉన్న న్యాయవాదులపై దాడికి పాల్పడే వారికి ఆరు నెలలు నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు కనీసం 25 వేల వరకు జరిమానా విధిస్తారన్నారు.ఒకవేళ సదరు వ్యక్తి రెండోసారి నేరానికి పాల్పడితే ఆ శిక్ష ఒక్కటి నుంచి ఏడేళ్లు వరకు పొడిగించేలా 50 వేల నుంచి గరిష్టంగా ఒక లక్ష జరిమానా వసూలు చేసేలా చట్టంలో నిబంధనలు చేర్చారు. తప్పుడు కేసులు (మెలీషియస్ ప్రాసిక్యూషన్) బనాయించే వ్యక్తులకు సైతం మూడేళ్ల జైలు శిక్ష 25 వేలు జరిమానా అదనంగా విధిస్తారన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.