26.9 C
Hyderabad
Wednesday, August 12, 2026

దూదిగాం నేషనల్ హైవే 44 పై అరైవ్-అలైవ్ ప్రోగ్రాం

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం అరైవ్- అలైవ్ కార్యక్రమంలో భాగంగా మెండోర మండలంలోని దూదిగాం  గ్రామ శివారులో కోతిదేవుడు సమీపం బ్లాక్ స్పాట్ వద్ద నేషనల్ హైవే 44 పైన గమ్యం- సురక్షితం  రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో  ఆర్మూర్ రూరల్ సీఐ  జాన్ రెడ్డి,  మెండోరా ఎస్సై సుహాసిని జాదవ్, గ్రామ సర్పంచ్ , మరియు NHAI అధికారులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలను పెద్ద సంఖ్యలో సమీకరించి, రోడ్డు ప్రమాదాల నివారణపై సమగ్రంగా అవగాహన కల్పించబడింది.
సమావేశంలో ముఖ్యంగా క్రింది అంశాలపై వివరంగా చర్చించబడింది:హెల్మెట్ ధరించడం యొక్క అవసరం మరియు ప్రాముఖ్యత గురించి వివరించి, హెల్మెట్ వాడకం వల్ల ప్రాణనష్టం తగ్గుతుందని తెలియజేయబడింది.గతంలో ఈ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలు తెలియజేసి, అవి ఎలా జరిగాయో ఉదాహరణలతో వివరించారు.
రోడ్డుపై ధాన్యం ఆరబెట్టడం వల్ల వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అలాంటి చర్యలను పూర్తిగా నివారించాలని గ్రామ ప్రజలకు సూచించారు.అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసి, ప్రతి ఒక్కరూ “Go Slow” నియమాన్ని పాటించాలని కోరారు.అదేవిధంగా, ప్రమాదాల నివారణ కోసం బ్లాక్ స్పాట్ వద్ద “GO SLOW” అనే హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయబడింది. ఈ బోర్డు ద్వారా వాహనదారులకు ముందస్తు హెచ్చరిక అందించబడుతూ, ప్రమాదాల తగ్గింపుకు దోహదపడుతుంది.ఈ అవగాహన కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలు రోడ్డు భద్రతపై చైతన్యవంతులు కావడంతో పాటు, భవిష్యత్తులో ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని హామీ ఇచ్చారు.
- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.