ఆర్మూర్ :ఆలూర్ మండలంలోని మచ్చర్ల గ్రామ వాస్తవ్యులు రామచంద్రారెడ్డి తన జన్మభూమి మచ్చర్ల గ్రామమని,ఉన్న ఊరు కన్నతల్లి గొప్పదని గ్రామంలోని రాజరాజేశ్వర మందిరం వద్ద ఒక గదిని నిర్మించారు.గ్రామపంచాయతీపై లైబ్రరీని ఏర్పాటు చేశారు అలాగే వాటర్ ప్లాంట్ కూడా అందజేశారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 25 డేస్ నుంచి అందజేస్తున్నారు.ఈ సందర్భంగా స్థానిక ఉపసర్పంచ్ కట్ట నర్సయ్య, విజయ్ మెడికల్ అధినేత గుమ్మడి విట్టల్, బీపీఎం రమేష్ రెడ్డి మాట్లాడుతూ తన దాతృత్వంతో జన్మభూమికి సేవలు అందించడం మా గ్రామస్తుల అదృష్టమని, నోముల రామచంద్రారెడ్డి సేవలను కొనియాడి, శాలువాతో సత్కరించి అభినందించారు.



