Wednesday, June 10, 2026

నిరుద్యోగులకు శుభవార్త …దరఖాస్తుల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

మెండోరా: మెండోరా మండలంలోని సోన్‌పేట్, చాకిర్యాల్, బుస్సాపూర్, మెండోరా ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభమైన ప్రీ-ప్రైమరీ పాఠశాలల కోసం ఇన్స్ట్రక్టర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి డి. శ్రీనివాస్ తెలిపారు. తాత్కాలికంగా 10 నెలల గౌరవ వేతనం ఆధారంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఇన్స్ట్రక్టర్ పోస్టులకు ఇంటర్మీడియట్‌తో పాటు టీటీసీ అర్హత ఉండాలని, ఆయా పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని తెలిపారు. అభ్యర్థులు సంబంధిత హాబిటేషన్, గ్రామం లేదా మండలానికి చెందిన వారై ఉండాలని, 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని సూచించారు.

అర్హులైన అభ్యర్థులు ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు సంబంధిత పాఠశాలల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయని మండల విద్యాధికారి వెల్లడించారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This