నందిపేట్ మండల కేంద్రంలో ఆదివారం అమ్మ నాన్న ఫౌండేషన్ చైర్మన్, గ్రామ సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత మండల కేంద్రం లక్ష్యంతో “స్టీల్ బ్యాంక్”ను ప్రారంభించారు.
సుమారు 5,000 స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్ను గ్రామ ప్రజలు శుభకార్యాల కోసం ఉచితంగా వినియోగించి తిరిగి అప్పగించవచ్చు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణం, ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ, స్టీల్ ప్లేట్లు, గ్లాసులను స్టేట్ బ్యాంకులో ఏర్పాటు చేశారు. ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ శుభ,అశుభ కార్యక్రమాలకు వినియోగించుకొని యధావిధిగా అందజేయాలని కోరారు. ఉచితంగా స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు అందజేయడం చాలా గొప్ప విషయమని సర్పంచ్ సేవలను గ్రామ ప్రజలందరూ అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.


