మెండోరా: మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో బుధవారం రోజున ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్, సర్పంచ్ నూతిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ మూర్పూర్ సతీష్, గ్రామ కార్యదర్శి భోజందర్ పాల్గొన్నారు. వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని కార్మికుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.



