బాల్కొండ: అయ్యప్ప ఆలయంలో 5వ తేది మాసపూజ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. గణపతి, సుభ్రమణ్యస్వామి, శ్రీచక్రం అయ్యప్పస్వామి లకు అభిషేకాలు నిర్వహించారు.అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు.ముప్కాల్ వాస్తవ్యులు తిమ్మాన్నగారి లాస్య -శ్రీనివాస్ రెడ్డి లు అన్నదాన సత్రానికి దాత గా వ్యవహారించారు.ఈ కార్యక్రమం లో అయ్యప్ప ఆలయ అధ్యక్షులు మల్లెపూల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు జెట్టి జనార్దన్,, కార్యదర్శి బొట్ల రవీన్ ప్రసాద్, కోశాధికారి అంబటి నవీన్, ఆలయ కమిటీ పూర్వ అధ్యక్షులు చౌటి కిషన్,ఆలయ పూజారి గణేష్ జోషి ఆలయకమిటి సభ్యులు మెడికల్ నరేందర్, కోటగిరి రమేష్, శ్రీకర్, శ్యామ్, నితిన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



