25.8 C
Hyderabad
Thursday, August 13, 2026

మహిళా సాధికారతకు రేవంత్ రెడ్డి ప్రోత్సాహం… బాల్కొండ మండల సమాఖ్యకు ఆర్టీసి బస్సు

Must read

📰 Generate e-Paper Clip

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉంటున్నారు… మహిళా సాధికారతకు ఆయన పెద్దపీట వేయడంతో మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తుంది…తెలంగాణలో మహిళా సాధికారతను, ఆర్థిక స్వాలంబనను పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “ఇందిరా మహిళా శక్తి” కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కోటి మంది మహిళలను ఆర్థికంగా కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యంగా, వారికి వడ్డీ లేని రుణాలు, ఉపాధి అవకాశాలు మరియు వివిధ వ్యాపారాల్లో శిక్షణను అందిస్తున్నారు.
ఈ మేరకు ఇందిరా మహిళా శక్తి లో భాగంగా RTC బస్సు ను బాల్కొండ మండల మహిళా సమాఖ్య 36 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ బస్సును మహిళా సమైక్య ఆర్టీసీకి అప్పగించి ప్రతినెల 18 పొందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బస్సును వినియోగించుకుని ఆర్టీసీ ప్రతినెల 69 వేల రూపాయలను బాల్కొండ మండలం మహిళా సమాఖ్య కు 80 నెలలపాటు చెల్లించనుంది. కార్యక్రమంలో భాగంగా బస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ప్రారంభించడానికి బాల్కొండ మండల మహిళా సమాఖ్య సభ్యులు మంగళవారం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. వీరి వెంట అధ్యక్షురాలు స్వరూప, ఐకెపి ఎపిఎం గంగారం , ఇతర సభ్యులు ఉన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.