వేల్పూర్: వేల్పూర్ మండలం కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థిని, విద్యార్థులకు శాలువా, మెమెంటోతో ఘనంగా సన్మానం చేశారు. సంఘం పెద్దలు విద్యార్థులను అభినందించి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


