subhodayam.news
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 10:57 am Digital Edition : jindham narahari

గురుపౌర్ణిమి సందర్భంగా సుబ్బారావు మాస్టర్ ను సన్మానించిన హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులు…

ఆర్మూర్ పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని హనుమాన్ మందిరంలో వ్యాస పూర్ణిమ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదాలు, ఉపనిషత్తులను అవపాసన చేసుకున్న ప్రముఖ వేద పండితులు సుబ్బారావు పంతులును పూలమాల శాలువతో ఘనంగా సన్మానించారు.కాలనీవాసి, హనుమాన్ మందిర్ మాజీ అధ్యక్షులు విశ్రాంత ఉపాధ్యాయులు పిప్రికర్ పుష్పకర్ రావు మాట్లాడుతూ గురుపూర్ణిమ సందర్భంగా హనుమాన్ మందిరంలో కాలనీవాసులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రముఖ గురుదేవులు సుబ్బారావు పంతులును సన్మానించడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. నిండు నూరేళ్లు అనునిత్యం ఆనందంగా గడపడానికి ఆ భగవంతుడు శక్తి, యుక్తులు ప్రసాదించాలని కోరారు.