subhodayam.news
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 7:57 pm Digital Edition : Narendhar

ముప్కాల్ లో PRTU మండల సభ్యత్వ నమోదు

ముప్కాల్: 2026 సంవత్సరానికి PRTU సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ZPHS ముప్కాల్ మరియు కేజీబీవీ పాఠశాల లో మండల అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి కొండ్రు నవీన్ గార్లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వివిధ సమస్యలు గురించి చర్చించడం జరిగిందని, అలాగే రానున్న రోజుల్లో ప్రభుత్వ మానిఫెస్టో లో పెట్టిన CPS రద్దు PRTU బాధ్యత అని PRTU అందరినీ కలుపుకొని అన్ని కేటగిరీల ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక పెద్ద సంఘం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముప్కాల్ పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు సునీత కేజీబీవీ ఇంచార్జ్ మేడం శ్యామల మరియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నరేందర్ ప్రసాద్ లక్ష్మణ్ SG శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ మండల అసోసియేట్ అధ్యక్షులు రవి కుమార్ మహిళా ఉపాధ్యక్షురాలు ఇందిరా మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.