subhodayam.news
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 6:23 pm Digital Edition : jindham narahari

పద్మశాలి కన్వెన్షన్ కళ్యాణ మండపం అడాక్ కమిటీ ఆధ్వర్యంలో మూడు నెలలకు ఒకసారి జరిగే సమీక్షా సమావేశం…

ఆర్మూర్ : పద్మశాలి కళ్యాణ మండపం (కొటార్మూర్) ఆర్మూర్ అడహాక్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వాటాదారుల సమీక్షా సమావేశంలో జిల్లా అధ్యక్షులు బిజ్జు దత్తాద్రి  నియోజకవర్గ అధ్యక్షులు దాసరి సునీల్ కుమార్  సీనియర్ నాయకులు నూకల విజయ్ మండల అధ్యక్షులు బొడ్డు గంగాధర్, కోశాధికారి చెలిమెల రాజేందర్ మరియు పద్మశాలి ముద్దు బిడ్డ డా,,జల్ద ప్రకాష్ కళ్యాణ మండపంలో ఇప్పటివరకు జరిగిన పనుల జమ ఖర్చులను చదివి వినిపించారు.నిర్మాణ పనుల గురించి వివరించడం జరిగినది. అడాక్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఒక్కొక్కరు తమ బంధువులను పద్మశాలి కుల బాంధవులను, పరిచయస్తులను ఒకరు లేదా ఇద్దరు కొత్త సభ్యులను చేర్పించాలని కోరారు. ఇలాగే ఐకమత్యంతో ముందుకెళ్లాలన్నారు.ఈ కార్యక్రమంలో గోనె దామోదర్, పట్టణ – 2 అధ్యక్షులు గుజ్జేటి రాము,అంబల్ల శ్రీనివాస్,చిట్ల యజ్ఞేష్,డా,,రమణ,ధర్మపురి, నందల లింబాద్రి ,గుద్దేటి రమేష్,జిందం నరహరి,గుండ్ల పల్లి నర్సయ్య, మ్యాక లక్ష్మణ్, డి రాజు ,మ్యాక శ్రీధర్ , వేముల అమర్ ,రాక్సీ రమేష్ ,దాసరి దామోదర్ ,లింగం గోవింద్ పేట్, దాసరి మోహన్ సుర్భిర్యాల్, డా,,చిలుక శ్రీనివాస్ ,పొతు అర్జున్,పాడాల సుదర్శన్ ,గజం సురేష్  పాల్గొన్నారు.ఈ సందర్భంగా వాటాదారులందరూ నిర్మాణ పనులను పరిశీలించి అడహాక్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేసి, ప్రోత్సహించారు.ఇలాగే ఐకమత్యంతో ముందుకెళ్లాలని ఎవరు ఆటంకపరచినా బాధ పడవద్దని ఆటంకపర్చిన వారు ఏదో ఒక రోజు మన వద్దకు వస్తారని ఓపిక పట్టడం ముఖ్యమని అన్నారు.