నందిపేట్ మండలంలోని వన్నెల్ (కే) గ్రామ మాజీ సర్పంచ్ అబ్బి గంగారాం ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వన్నెల్ (కే) గ్రామంలోని అబ్బి గంగారాం ఇంటికి వెళ్లి పలకరించి,యోగక్షేమాలు,ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నీవు డైనమిక్ లీడర్ వని,ఆధార్యపడవద్దని ఏ విషయంలోనైనా నీకు అండగా మేముంటామని, భగవంతుని దయవలన తొందరగా కోలుకొని రాజకీయాల్లో మాతో కలిసి నడవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా అబ్బి గంగారాం మాట్లాడుతూ నా ఆరోగ్య పరిస్థితి గురించి చింతిస్తున్నానని,స్వయానా మా ఇంటికి వచ్చి, యోగ క్షేమాలు తెలుసుకొని,ధైర్యం చెప్పిన ఎంపి,ఎమ్మెల్యే లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.