బాల్కొండలో సర్ ప్రోగ్రాంపై అవగాహన కల్పించిన కాంగ్రెస్ నాయకులు

బాల్కొండ: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సర్ ప్రోగ్రాం పై బాల్కొండ మండల కేంద్రంలో ఓటర్లకు కాంగ్రెస్ నాయకులు అవగాహన కల్పించారు. 14 వ వార్డులో వారు విస్తృతంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో  బాల్కొండ మండల పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ పట్టణ అధ్యక్షులు సంజీవ్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తౌటు అరవింద్ కుమార్ డిసిసి జనరల్ సెక్రెటరీ యూనిస్ షేరు జనరల్ సెక్రెటరీ పిట్ల తేజ తదితరులు పాల్గొన్నారు.