బాల్కొండ: మాదకద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనార్థాల పై విద్యార్థులకు బాల్కొండ ఎస్సై కే శైలేందర్ విస్తృతంగా పలు పాఠశాలలను సందర్శించి అవగాహన కల్పించారు. యాంటీ డ్రగ్స్ కార్యక్రమం లో భాగంగా ఈ రోజు బాల్కొండ మండల కేంద్రంతో పాటు కిసాన్ నగర్ లో ఆయన ప్రచారం నిర్వహించారు. మదర్ థెరిస్సా, శాంభవి, కృష్ణవేణి , ZPHS బాల్కొండ, ZPHS కిసాన్ నగర్, మోడల్ స్కూల్ లలో దాదాపు 900 మంది కి డ్రగ్స్ మరియు గంజాయి మరియు వాటి దుష్ప్రభావాల పైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఈ అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు.