బాల్కొండ: ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలక వర్గం వినూత్న రీతిలో నిర్ణయం తీసుకోంది. గ్రామంలో గల నర్సరీ నుండి 3వ తరగతి వరకు విద్యార్థులు అందరినీ UPS పాఠశాల లోనే చదివించాలని, గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేయడం జరిగింది, ప్రైవేట్ పాఠశాలల్లో ఎవ్వరూ కూడా పంపా వద్దు అని తెలిపారు, ఇట్టి తీర్మాన కాపీను స్కూల్ హెచ్ఎం కు మరియు గ్రామ సహకార సంఘం అధ్యక్షులకు కలిసి ఇవ్వడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరి గంగాధర్, ఉప సర్పంచ్ పంతంగి మదన్ కుమార్, మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి మంచిర్యాల కవిత మేడం, వార్డు సభ్యులు రవి, నారాయణ, సాయిలు, సురేష్, గంగమణి, ముత్తన్న , స్కూల్ హెచ్ఎం లక్ష్మణ్ , సహకార సంఘం అధ్యక్షులు నల్ల వినయ్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయురాళ్లు, అంగన్వాడి టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.