subhodayam.news
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 10:07 pm Digital Edition : jindham narahari

రోటరీ ఆధ్వర్యంలో “పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీతకు సన్మానము …

ఆర్మూర్:  రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్వర్యంలో ఇటివలే మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఉత్తమ పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా పట్టణ సామాజిక సేవకులు పట్వారి తులసి కుమార్ నీ రోటరీ క్లబ్ పీడీజి Rtn హనుమంత్ రెడ్డి అధ్వర్యంలో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ వీరి సేవలను ఆదర్శం గా తీసుకోవాలని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ కి గర్వకారణమన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాధాకృష్ణ ,రాము, కాంతి గంగా రెడ్డి, విజయ సారథి, పుష్పకర్ రావులింగా గౌడ్,దాసరి సునీల్, గోపికృష్ణ పట్వారీ,రాస ఆనంద్, గోనె దాము,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.