“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా జాతీయ అవార్డు "పర్యావరణ మిత్ర" అవార్డు అందుకున్న సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంకాపూర్ లోని తన నివాసంలో పట్వారి తులసి ని ఆహ్వానించి శాలువ తో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పట్వారి తులసి సేవలతో అత్యున్నత జాతీయ పురస్కారం అందుకోవడం జిల్లాకే గర్వకారణమన్నారు.వీరి సేవలు జీవన విధానం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమన్నారు.తులసికి ఎల్లప్పుడూ మా పూర్తి సహాయ సహకారాలు...