భీంగల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భీంగల్ మండల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల.లక్ష్మణ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని కొనియాడారు.అమరవీరుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.