భార్గవి విద్యాలయంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మెండోరా: మెండోరా మండల కేంద్రంలోని భార్గవి విద్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ సి.హెచ్ రాజన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్.రాజేందర్,అధ్యాపక బృందం, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర కీలకమని ఉపాధ్యాయులు సూచించారు.