subhodayam.news
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 9:50 am Digital Edition : RAJU CH

మెండోరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మెండోరా: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెండోరా మండల కేంద్రంలోని ఎమ్మార్వో (తహసీల్దార్) కార్యాలయం మరియు ఎంపీడీవో కార్యాలయాల్లో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.
కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ వేణుగోపాల్ చారి పాల్గొని అధికారులు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎంపీడీవో లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో కూడా వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.