subhodayam.news
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 7:32 pm Digital Edition : Narendhar

జలాల్పూర్ గ్రామంలో సామూహిక ఇందిరమ్మ గృహప్రవేశాలను ప్రారంభించిన సర్పంచ్

బాల్కొండ: జలాల్పూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకంలో  బొజ్లే సువర్ణ,  గుండ్ల గంగమనణి ల నూతన గృహప్రవేశం కార్యక్రమాన్ని  సర్పంచ్  గుండేటి మోహన్ రెడ్డి  ప్రారంభించారు.  ఇట్టి కార్యక్రమంలో గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా విచ్చేసిన ఎంపీ ఓ గంగా మోహన్ , గ్రామ కార్యదర్శి దేవేందర్, పాలకవర్గ సభ్యులు సుద్ధపల్లి గంగు, ప్యాట్ల గంగుబాయి ఉల్లెంగ లక్ష్మి, గుండు రాజేందర్, రాటం సాగర్, ఎంబరి నాగేష్ ,మూగబోజన్న కుంట శేఖర్ ,ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుండేటి దేవేందర్ ,మూగ సాయిలు అవుట్ల సాయన్న, కారోబార్ వేణుగోపాల , ప్రదీప్ మరియు ఇతర నాయకులు సంజీవ్ రంజిత్ లు పాల్గొన్నారు