Wednesday, June 10, 2026

మెండోరా మండలంలో ఘనంగా 17 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు

📰 Generate e-Paper Clip

మెండోరా: మెండోరా మండలంలోని వివిధ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన 17 ఇందిరమ్మ ఇండ్లకు ఎంపీడీవో లక్ష్మణ్ ఆధ్వర్యంలో సోమవారం గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో గోలి సత్తెమ్మ, దుంపిడి నాగలక్ష్మి ల నూతన గృహాలను ఘనంగా ప్రారంభించి గృహప్రవేశం నిర్వహించారు.
కార్యక్రమంలో సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మిట్టపల్లి రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శి జాకీర్ హుస్సేన్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This