Wednesday, June 10, 2026

ఒంటి చేత్తో మంటలార్పిన సర్పంచ్…

📰 Generate e-Paper Clip

ఖద్దరు చొక్కాలు… ఆఫీస్ లో ఫ్యాన్ల కింద బాతఖానిలు… చుట్టూ మంది మార్బలంతో తమ ఉనికిని చాటుకునే ప్రజా ప్రతినిధులు ఉన్న ఈ రోజుల్లో… ప్రజలకు కష్టం వస్తే తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వొంటి చేత్తో అగ్ని మంటలను ఆర్పి వేసిన సర్పంచు ఉదంతమిది.

బాల్కొండ పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా ఉష్ణోగ్రత 45 నుండి 46 డిగ్రీల పైన ఎండలు ఉంటున్నాయి. ఈ దశలో బాల్కొండ మండలంలోని జలాల్పూర్ పంట పొలాల్లో సోమవారం సాయంత్రం పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దాదాపు 40 ఎకరాల గడ్డివాములు ఈ అగ్ని కీలలకు ఆహుతి అయ్యాయి. ఈ మంటలు పక్కనే ఉన్న ఎయిర్టెల్ టవర్కు అంటుకొని భారీ నష్టం వాటిల్లే ప్రమాదము ఉండడంతో స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి ఒక్కడే రంగంలోకి దిగి నీటి పైపులతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సర్పంచ్ ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This