subhodayam.news
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 10:17 am Digital Edition : jindham narahari

ఆర్మూర్ సీ.ఐ సత్యనారాయణ గౌడ్ తో వడదెబ్బ- జాగ్రత్తలు అనే కరపత్రాన్ని ఆవిష్కరింపజేసిన సమాజ సేవకుడు పట్వారి తులసి…

ఆర్మూర్:  జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి రూపొందించిన వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు అనే కరపత్రాన్ని ఆర్మూర్ పట్టణ C.I సత్యనారాయణ గౌడ్ పోలీస్ స్టేషన్ ఆఫీసులో ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ వేసవిలో వడదెబ్బకు ఇటీవల ఎంతోమంది మరణిస్తున్నారు.కాబట్టి ప్రతీ ఒక్కరు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళవద్దని తాగునీరు ఎక్కువగా తీసుకోవాలని,ఎలక్ట్రోలైట్ పౌడర్ ని వాడుతూ ఉండాలని, కొబ్బరి నీరు,వాటర్ తో కూడిన పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలని, తెల్లని దుస్తులు ధరించాలని,వేసవి కాలంలో ముఖ్యంగా చెరువుల దగ్గరికి వెళ్లివద్దని, వివిధ రకాలైన సూచనలను ప్రజలకు తెలియజేసి పట్వారి తులసి సమాజ శ్రేయస్సుకు చేసే సేవలను ప్రతీ ఒక్కరూ అనుసరించాలన్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.