subhodayam.news
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 7:13 pm Digital Edition : jindham narahari

అప్పాల రాజవ్వ కుటుంబ సభ్యులను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్

భీంగల్ మండలంలోని జాగిర్యాల గ్రామానికి చెందిన ఈనాడు రిపోర్టర్ శ్రీనివాస్ మాతృమూర్తి అప్పాల రాజవ్వ ఇటీవల అకాల మరణం పొందిన సందర్భంగా సమాచారం తెలిసిన వెంటనే బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునిల్ కుమార్ జాగిర్యాలలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తల్లి అప్పల రాజవ్వ ఆత్మశాంతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ… కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని ఆ భగవంతుని వేడుకొని, ప్రగాఢ సానుభూతిని ,సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.