మే 3, 2026న నిర్వహించిన NEET (UG) 2026 పరీక్షను రద్దు చేసినట్లు NTA ప్రకటించింది.కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు తెలిపింది. కొత్త తేదీలు త్వరలో ప్రకటిస్తారు.పరీక్ష నిర్వహణలో జరిగిన అంశాలపై CBI విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.ఇప్పటికే చేసిన రిజిస్ట్రేషన్, పరీక్షా కేంద్రాల ఎంపిక తదితర వివరాలు యథాతథంగా కొనసాగుతాయి.విద్యార్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అదనపు పరీక్ష ఫీజు ఉండదని NTA స్పష్టం చేసింది. ఇప్పటికే చెల్లించిన ఫీజులను విద్యార్థులకు తిరిగి చెల్లిస్తామని తెలిపింది. కొత్త అడ్మిట్ కార్డులు, రీ-ఎగ్జామ్ తేదీల వివరాలు అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడిస్తారు.
సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని NTA సూచించింది.