subhodayam.news
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 8:18 pm Digital Edition : Akula Suraj

పదిలో విజేతలకు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం

వేల్పూర్  బడ్జెట్ స్కూల్స్ అసోసియేషన్ తెలంగాణ, నిజామాబాద్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్మూర్ డివిజన్ విద్యార్థులకు ఘనంగా ‘ప్రతిభా పురస్కారాలు’ అందజేశారు. వేల్పూర్ మండలంలోని అనిల్ బ్లాంకెట్ హాల్‌ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులను నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలతో సన్మానించారు.
విజేతలు వీరే డివిజన్ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కింది విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేశారు.ప్రథమ స్థానం కుమారి జె.శాలిని 576(మిసిమీ హై స్కూల్,కమ్మరపల్లి)ద్వితీయ స్థానం తాంజీలా ఆఫీన్ 572(నవోదయ హై స్కూల్, మోర్తాడ్)తృతీయ స్థానం మహిత 570 (లిటిల్ ఫ్లవర్ హై స్కూల్, వెల్గటూర్)వీరితో పాటు, ఆయా పాఠశాలల్లో మొదటి స్థానంలో నిలిచిన 19 మంది విద్యార్థులను కూడా అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేకంగా సన్మానించి, పురస్కారాలను అందజేశారు.ముఖ్య అతిథులు
ఈ కార్యక్రమంలో బడ్జెట్ స్కూల్స్ ఫౌండర్ డాక్టర్ షఫీ, జిల్లా అధ్యక్షులు శ్రీ నంబుల గిరి సెక్రటరీ శ్రీ బాలి రవీందర్, కోశాధికారి శ్రీ జువ్వి హరీష్ పాల్గొని విద్యార్థులను అభినందించారు.