ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య…
ఆర్మూర్: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రైవేట్ స్కూలు మోజులో పడకుండా తప్పనిసరిగా మనందరం మన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి, మన ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకుందామని సర్పంచ్ సారంగి శాంతి కుమార్ పేర్కొన్నారు.సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేపూర్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిపిన బడి బాట కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో సమావేశమై మాట్లాడినారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి చేతన కుమారి,ఉప సర్పంచ్ చరణ్,ఉపాధ్యాయులు సంగెం అశోక్, సౌడ రవి ,గంగాధర్ లింబాద్రి,విక్రమ్, వనజ, మనీష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.