ఆర్మూర్ : ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ రాకేష్ రెడ్డి ఇటీవల పదవ తరగతి ఫలితాల్లో భాగంగా మర్రి శ్రీనిధి s/o మర్రి రాజు ఎన్టీఆర్ కాలనీ ఆర్మూర్ , జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ ఆర్మూర్ లో టాప్ 548/600 మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా మరియు మండల స్థాయిలో సెకండ్ వచ్చినందుకు జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వనజ రెడ్డి, ఉపాధ్యాయురాల్ల బృందానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎం శ్రీనిధిని శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టూడెంట్స్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయ బృందం తోటి విద్యార్థినుల సహకారంతోనే మర్రి శ్రీనిధి విజయం సాధించిందని కొనియాడారు. విద్యార్థిని శ్రీనిధి తల్లిదండ్రులను అభినందించారు.