వేల్పూర్: SSC 2004-2005 బ్యాచ్కు చెందిన భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ, వేల్పూర్ తరఫున వేల్పూర్ గ్రామానికి చెందిన మంగళి హరీష్ కి రూ.15,వేల ఆర్థిక సహాయం అందించారు.హరీష్ కి ఇటీవల బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే.ఆయన తన వృత్తి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే,కడుపేదరికంలో ఉన్న ఆయనకు హఠాత్తుగా ఆరోగ్య సమస్య రావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.ఈ విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు వెంటనే స్పందించి, హరీష్ కి ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు గజేందర్, సురేష్, బాలు, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.