Wednesday, June 10, 2026

కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గంతో రోడ్లపైకి జనం వచ్చారు

📰 Generate e-Paper Clip

బాల్కొండ: రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బాల్కొండ మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎంఏ షహీద్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాల ఫలితంగా అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.కేసీఆర్  హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆగస్టు 2023లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు.
సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం తాత్కాలికంగా నైపుణ్యం లేని డ్రైవర్లను నియమించడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు ప్రాణహాని ఉంది అలాగే రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనాలకు జనాలకు కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయిఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించి సమ్మె విరమణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకపోతే జరిగే పరిణామాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఆర్టీసీ కార్మికుల పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని షహీద్ స్పష్టం చేశారు..
Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This