subhodayam.news
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 10:29 am Digital Edition : Narendhar

జలాల్ పూర్ లో ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించిన సర్పంచ్

బాల్కొండ:  మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకంలో కొత్తగా మంజూరు అయినా SRSP మట్టిపూడిక తియ్యడం పనులను జలాల్పూర్ లో స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్  మాట్లాడుతూ SRSP లో నల్లమట్టిని రైతులు పొలాలకు తీసుకెళ్లాలని ఎండలు ఎక్కువ ఉన్నందున ఉదయం 6నుండి 7 వరకు పనులకు వచ్చి 10నుండి 11 గంటల లోపు వెళ్లాలని అలాగే నీళ్లు ORS పాకెట్స్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ క్యాతం కిషన్ గౌడ్ గారు వార్డు సభ్యులు EX ఎంపీటీసీ రాటం సాగర్ సుధాపల్లి గంగు  ఫీల్డ్ అసిస్టెంట్ గడ్చాంద అనిల్ కుమార్ ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.