subhodayam.news
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 8:00 am Digital Edition : Narendhar

4వ సారి పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్

ఎరుగట్ల: ఏరుగట్ల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా నాలుగవ సారి తాజాగా జక్కాని శ్రీధర్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తిరిగి నాలుగోసారి అధ్యక్షునిగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవలో ముందుకు సాగుతాను. ఇది నా గౌరవం కాదు, మన సంఘం ఐక్యతకు నిదర్శనమని ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.