రెండు ద్విచక్రవాహనాలకు నిప్పుపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని కెసిఆర్ కాలనీలో అర్ధరాత్రి దుండగులు రెండు టూ వీలర్ వాహనాలకు నిప్పు పెట్టారు.ఒక్కసారిగా కెసిఆర్ కాలనీ వాసులు ఉలిక్కిపడి తీవ్ర భయందోళనకు గురయ్యారు.వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.కేసు నమోదుచేసుకొనిదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి సంజీవ్ సూచించారు.