కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు లక్ష, తులం బంగారం ఇవ్వాలి_ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్
బాల్కొండ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులు అందుకున్న ప్రతి లబ్ధిదారునికి, అలాగే ప్రస్తుతం కొత్తగా మంజురు కాబోయే లబ్దిదారులకు లక్ష రూపాయల చెక్తో పాటు తులం బంగారం ఇవ్వాలని బాల్కొండ ఎమ్మెల్యే , మాజీ మత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద కొత్తగా మంజూరు కోసం సిద్ధంగా ఉన్న మొత్తం 127 బ్యాచ్ ఫైల్స్పై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు.బాల్కొండ (19), వేల్పూర్ (20)మెండోరా...