subhodayam.news
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 1:18 pm Digital Edition : jindham narahari

ప్రముఖ సామాజిక సేవకుడు కొట్టూర్ శ్రీమాన్ అశోక్ ఆధ్వర్యంలో కంటి శిబిరం

కంటి శిబిరం లో మోతి బిందు ఆపరేషన్ చేసుకున్న వారికి కంటి అద్దాలను ఉచితంగా  సమాజ సేవకులు కొట్టూర్ శ్రీమాన్ అశోక్ పంపిణీ చేశారు.ఆర్మూర్ డివిజన్ మామిడిపల్లి చౌరస్తా షాపింగ్ మాల్ పక్క గల్లి నుండి మొత్తం 62 మంది వచ్చారు. అందులో 44 మందిని హైదరాబాద్ కార్పోరేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది.5మందిని నిజమాబాద్ జిల్లా కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది.3మందిని వరంగల్ జిల్లా కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. 4 మందిని మహబూబ్ నగర్ జిల్లా కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది.1మందిని నిర్మల్ జిల్లా కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది.1 ఒకరిని మెట్ పెల్లి డివిజన్ కు కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది., ఉచిత మోతిబిందు ఆపరేషన్ ఉన్నవారు తెలంగాణలో రాష్ట్రంలో ఏ జిల్లాకైనా తనను 94400 38389 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించాలని సమాజ సేవకులు కొట్టూర్ శ్రీమాన్ అశోక్ కోరారు.