వేల్పూర్: పూలే మహిళల కోసం ఎనలేని కృషి అసమానతలను వ్యతిరేకించిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని కొత్తింటి ముత్యంరెడ్డి అన్నారు.వేల్పూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో పూలే మహాత్మ జ్యోతిరావుపూలే199వజయంతి ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులుఅర్పించారు.మహిళల కోసం తన భార్యతో కలసి ఎనలేని ఆసక్తికరమైన పోరాటాలు చేసిన మహాయోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు.ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి,డైరెక్టర్లు,సిబ్బంది మొహ్సిన్ తదితరులు పాల్గొన్నారు.